చింతా రామ కృష్ణా రావు. తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
సంస్కృతాంధ్ర కవిపండితులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీశ్రీశ్రీ చింతారామకృష్ణారావుగారిచేరచింపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్ఫూర్తి గీతం యావద్రాష్ట్రభౌగోళికాంశములను సుస్పష్టపరుస్తున్నది.ఇచటి సుజలాలను,సుఫలాలను,ప్రసిద్ధపుణ్యక్షేత్రాలను, ప్రాజక్టులను పాటలో ఇమిడ్చి వర్ణించినవిధానం అద్భుతం. వీరి కలానికి శ్రీమతి వల్లూరి సత్యవతిగారి గళం తోడై లలితసంగీతఛాయలతో శ్రోతలను మంత్రముగ్థులను చేస్తున్నది.గాయని శ్రీమతి సత్యవతి గారికి అభినందనలు. శ్రీరామకృష్ణకవిగారికి నమస్సులు. భవిష్యత్తులో ఈ గీతం పాఠ్యపుస్తకాలలో ప్రచురణకు నోచుకోగలదని విశ్వసిద్దాం.
డా. సత్యయాజ్జ వల్క్య శర్మ.లింగాల
రి. గజిటెడ్ ప్థానోపాధ్యాయుడు.
పాయకరావుపేట.
అనకాపల్లి జిల్లా (ఆం. ప్ర)
9247168255
ఐతే ఇవే కాక ఇంకా చాలా చెప్పబడ్డాయండి. అందులో గణేశపురాణం కూడా ఉంది.
ఔనండి ఒకేపదాన్ని రెండుపర్యాయాలు ప్రయోగిస్తే శబ్దపునరుక్తిగా, ఒకే అర్థంలో పదాల్ని రెండ్శుపర్యాయాలు ప్రయోగిస్తే అర్థపునరుకు దోషంగా మన శాస్త్రాలు చెప్పుతున్నాయండి.
అజ్ఞాత ఇలా అన్నారు.
గురువు గారు, భరతమాత వైభవ దండకం అద్భుతం. అది శ్యామలాదండక స్వరభరితంగా చదవ మనమ్మునకానందమ్ము గల్గెన్. ధన్యుడినైతిని గురువర్యా.
కడయింటి కృష్ణమూర్త్యన
మడమనుత్రిప్పంగరాని మహనీయుండే,
వడివడి రామాయణమును
కడుముదమున వ్రాయఁ జేసె కవివర్యులచే.