మంథా వీరభద్రం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
రెండు చాదస్తపు పరిశీలనలు:
“- సమాజ శ్రేయస్సు, దేశపాలన తమ సమిష్టి బాధ్యత అన్న కనీస స్పృహను కోల్పోతున్నారు.”
ఇష్టి = యజ్ఞము,యాగము
సమిష్టి సమ్ + ఇష్టి = చక్కని యాగం
సమష్టి = సమస్తము, మొత్తము
అచ్చుతప్పులూ,వ్యాకరణదోషాలూ బాగానే చేసే,ఈనాటి ఈనాటి పత్రికలో కూడా ఈ శబ్దాన్ని సరిగానే వేస్తున్నారు.
” …సోషల్మీడియాలో ఈ నిర్భృత సైనికులంతా (unpaid soldiers) ఇదే రకమైన…
క్తాన్తాలూ, past passive partciple లూ సంస్కృతాంగ్లాలకు సహజంగా చెల్లుతాయి.
వాటిని అలాగే తెనుగులో కెక్కిస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది.
వెనుకటికి కోకటం మునిపల్లెను దానం పట్టిన చొక్కంరాజు గారబ్బాయి “ఏలని బంటు” అన్నాడు కదా. ఆ ప్రయోగం ఇక్కడ బాగుంటుందేమో. పోనీ యిది మరీ ప్రబంధాల పొలుపు తెలుపు పలుకుబడి అనిపిస్తే “జీతం లేని కూలీలు” వాడుక లోనే ఉంది కదా.
[మీ సూచనను అనుసరించి మార్పులు చేసాము. ధన్యవాదాలండీ. – సం.]
వురుపుటూరి వారు చాలా చక్కగా వ్రాసారు. తెనుగుసేత నేర్పుగా ఒదిగింది.
ఆధునిక కవి, నాటకకారుడైన కాలిదాసు తన మాళవికాగ్నిమిత్ర నాందీ ప్రస్తావనలో పూర్వ కవుల నాటకాల గురించి చెప్తూ సూత్రకారుడితో,
ప్రథితయశసాం భాస సౌమిల్ల కవిఫుత్రాదీనాం
ప్రబంధాన్ అతిక్రమ్య వర్తమానకవేః కాళిదాసస్య
క్రియాయాం కథం బహుమానః”
అని అనిపించాడు కదా. ఇద్దరి కాలాలూ ఎప్పటివైనా భాసుడి కన్నా కాళిదాసు అర్వాచీనుడు అన్నది నిర్వివాదం అనుకున్నాను. ఇక్కడ కొడవళ్ళ వారి వ్యాఖ్య చదివాక, ఇది కూడా కాదనే పండితులున్నారని తెలిసింది.
మ.వ్యా కీ, ఐతరేయ బ్రాహ్మణంలోని సునశ్శేపుడి కథకూ పోలిక ఎవరికైనా తడుతుంది. మాయాబజారు పోలిక మాత్రం తెనుగువాడికే తెలుస్తుంది. ఇంతకూ మాయాబజారు కథకు మూలం యేదో మరాఠీ నాటకంట కదా!
“కుంతీపుత్రుల్లో మధ్యముడు కదా” అని అన్నారు కథా సంగ్రహంలో.
ఇది అనవసరమైన అనుమానాలను రేకెత్తించి, మూలంలో యేముందో చూడాలనిపించేలా చేసింది. సమరస్తేమాభిరామాకృతితో వచ్చే మరో కుంతీపుత్రమధ్యముడున్నాడు కదా! అందుకని.