వివిన మూర్తి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
మీరు సరైన అంశం ఎంచుకున్నారు. మానవ వనరులు. దీనిని ఉపయోగించుకోవాలన్న విజన్ నేహ్రూ కి మాత్రం ఉండేది. మౌలికమైన మార్పులు మాత్రమే సమస్యకి పరిష్కారంగా భావించే నాబోటి కమ్యూనిస్టు ఆలోచనాపరులు ఆ ప్రయత్నాన్ని విప్లవాన్ని ఆలశ్యం చేసే ప్రయత్నాలుగా భావించాం. ఆబ్జిక్టివ్ గా ఆలోచించటం ఆరంభించాక నేహ్రూ విజనరీ అనేది అర్ధమయింది. నా టపాలో అంశం ప్రజాస్వామ్య భావన. దాని వైఫల్యం నెహ్రూ ఆపలేకపోయాడన్నది నా పాయింట్. కాకపోతే మానవ వనరుల వినియోగానికి సంబంధించిన దూరపుచూపుతో మనదేశం నెహ్రూ తదనంతరం నడవలేదు. ఉద్యోగకల్పన అనేది ఓటరు ఆకర్షణ నినాదంగా మారిపోయింది. అదే నినాదం ప్రతి ఎలక్షను ముందూ ప్రతిపార్టీ ప్రణాళికలోనూ చోటు చెసుకుంటోంది ఒక కర్మకాండ(వినాయక పూజతో ఆరంభించినట్టు) తరహాలో. మన నాయకులు సర్వైవల్ టాక్టిక్స్ కే పరిమితం కావటం. ఎన్నికలే ప్రధానం అనుకోటం, విధాన నిర్ణయాలు చర్చకి పౌరసమాజాన్ని ఆయుత్తం చేయకపోవటం ఎన్నో తప్పుడు ధోరణులు మన రాజకీయాలలో చోటు చేసుకున్నాయి. మనది ఏర్పడుతున్న జాతిరాజ్యం. ఇచ్ఛతో ఏకమవలేదు. విధివశాత్తూ భౌగోళికంగా ఏకమయాం. మన నాయకులకీ జాతి భావన లేదు. ఈనాడు జాతి అనే భావన కూడా అంగడి సరుకులా కొందరికి జాతిభక్తులు కొందరికి జాతిద్రోహులు అనే ముద్ర వేసే స్థితికి చేరుకున్నాం. పూర్తి మెజారిటీతో మోడీ వచ్చినపడు భావజాల వ్యతిరిక్తత ఉన్నా భాజపా మీరు ఎత్తిన మానవ వనరుల అంశాల వంటివి దేశసంపద వంటివి తీసుకుంటారని కొంత ఆశపడ్డాను. పూర్తిగా ఆ అంశాలను వదిలేసింది. దానికి బదులు సామాజిక అశాంతి ద్వారా అభద్రత సృష్టించి భయాందోళిత ప్రజానీకాన్ని తమ చెప్పుచేతలలో ఉంచుకునే నీచవ్యూహం అమలవుతోంది. ఈ అధికారం ఎందుకు అనే దృష్టి లేదు. మసీదులన్నీ గుడులు చేసేసారనుకుందాం.. తర్వాత? ఈలోగా? భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకత్వం లేదు. గతాన్ని విడిచిపెట్టని మేధోవర్గం ఉంది. గాలికీ ధూళికీ పెరిగే అనాథబిడ్డలాంటిదీ దేశం ప్రస్తుతం.