వెంకట రాజారావు . లక్కాకుల తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
'పరమాత్మా మన బాపతె'
పరాచికాలు తగునా ? , ప్రభాభాస్వంతా
పర నారాయణ పరమే
శ్వర కృష్ణునిపయి , అతండె జగతికి గతియౌన్ .
రామా ! రావేమిర ! రఘు
రామా ! మా మొర , వినీ , పరాకా ! రాకా
సోమా ! నీ పద సన్నిధి
లో మే ముండ తగమా ? త్రిలోకారామా !
కృష్ణ పరమాత్మ పిలుపుల కేసి ' తగ ని
రీక్షణ దొరకొంటి , నికను , కెరలి భువిని
సేయదగు కార్యములు గాని , శ్రియము గాని
లేవు , జాగేల ? కొనిపొమ్ము , కృష్ణ ! కృష్ణ !
కనగ కశ్మీరు చిలకమ్మ కళలు , మాకు
నవరసజ్ఞభరితమయ్యె , కవుల భావు
కతలు చదువ , నింత ఘనత గల తలమ్ము
గలదె ? కశ్మీరు గాక , భూతలము నందు .
తిరువాభరణములు దీసి పక్కనబెట్టి
ఇమ్ముగా హరికి గోణమ్ము గట్టి
పన్నీట దడిసిన పచ్చడమ్ములు దెచ్చి
లలితంపు రొమ్ము తల మొలజుట్టి
తుమ్మెదమైచాయ దొడరు నచ్యుతునికి
శిరసాది పచ్చ కప్పురము నలది
కన మల్లె పూవల్లె కన్నుల కింపైన
స్వామికి పునుగు జవ్వాది పట్టి
శుక్రవారాలు అలవేలు శోభనవతి
మగని కైసేసె , నెన్ని జన్మాల ఫలమొ !
దివ్యమంగళ వేంకట దేవదేవు
మోము వీక్షించు కొనరండు , పుణ్యఫలము 🙏
తలుపులు బార్లా దెఱచిరి ,
కలహాలకు పూని , పరసుగాళ్ళకు , భళిరా !
కలుములు నధికారంబులు
తొలగెను , బానిస బతుకులు దొరకొనె మనకున్ .
ధైర్యశాలురు హిందువుల్ , దారి తప్పి
ముస్లిములు , క్రిష్టియన్లు ఈ భూమి మీద
బతుక వచ్చిరి , ఐక్య సంభరిత చరిత
మనది , వేనోళ్ళ వొగడండి , కనులు దెఱచి .
ఇన్ని వంద లేళ్ళు హింద్వేతరులు వచ్చి
భరతభూమి నేల పాప మేమి ?
అన్య మేమి కాదు , ఐకమత్యము లేమి
నేడు కూడ నిదియె , చూడు విబుధ !
మంచి సమాజం క్లాసు రూములలోనే రూపు
దిద్దుకుంటుందని పెద్దలంటారు . మిగతా
వృత్తులకంటే ఉపాధ్యాయవృత్తికి సమాజం
పట్ల భాద్యత ఎక్కువ . సమాజంతో మమేక
మయ్యే అవకాశం కూడా ఉపాధ్యాయుడికి
ఎక్కువ ఉంది .
ఉపాధ్యాయవృత్తిపట్ల నిబధ్ధత కలిగి పనిచేసిన నాకు , నేటి భాద్యత మరిచిన ఉపాధ్యాయులంటే కినుక ఉంది .
' మేము చదువు చెబుతున్నాం . వాళ్ళు నేర్చుకోవడం లేదు . గుర్రాన్ని నీళ్ళవద్దకు
..... ఇలాంటిమాటలు ఈ వృత్తికి పనికిరావు.
పిల్లలలో IQ ఎక్కువ తక్కువ లుండవచ్చు .
కాని , వీడికి చదువురాదు - అని ముద్రేసి వదిలెయ్యరాదు . ఉపాధ్యాయుడు ఆసక్తి ఏర్పరచి నేర్పించాలి .
చదివితి తెల్గు నాంగ్లమును సంస్కృతమున్నొక కొంత , యిష్టమై
మదికి లయించు నొజ్జదనమందున ముప్పది యెన్మిదేండ్లుగా
బ్రదికితి , లక్షలాదికి నవారిగ జీవన మార్గ సత్యముల్
విదిత మొనర్ఛి ధన్యతల వెల్గుల గాంచితి ,
భాద్యతావిధిన్ .
మీరు పెద్దలు . లోకాన్ని చదివినవారు .తమకు తెయనివికావు .మన్నించండి . 🙏
ఇది కరెక్ట్ కాదు సార్ , అవినయం అనుకోవద్దు . ఎవరి భవిష్యత్తునూ
మనం ముందుగా ఊహించడం ,
వదిలేయడం నాకిష్ట ముండదు .
పది ఉత్తీర్ణతతో కొంతమందిలో ఆసక్తులు పెరిగి , పైకి చదువుకో వాలనే
తపన మొదులవుతుంది .
మా కేంపస్ లోనే ఇంటర్ ఉంది .
ఇంటర్ తర్వాత కొంతమంది టీచ్ ట్రయినింగ్ చేసేరు . కొంతమంది
ఇంజనీరింగ్ చేసేరు . మిగతవారు
తదితర వృత్తులను అందిపుచ్చు
కున్నారు . పదితోముగించినవారుకూడా
భవన నిర్మాణ కార్మికుగానో , ఇతరేతర
రంగాలలో నైపుణ్యాలను పొదివి పుచ్చు కున్నారు .
మీరు వారిని అసాంఘిక శక్తులుగా మా
రుతున్నట్లు భావించేరు . నేను తెగిన గాలిపటాలనడం - బతుకులు ఇబ్బంది
కరంగా - జీవనంగడవని - వాళ్ళ దారీ
తెన్నూ తెలియని పిల్లలనే ఉద్దేశ్యంతో
అన్నాను . పాపం ఆ అమాయకులను
మీరు వేరే కోణంలో (నాదృష్టిలో అవమానకరంగా)చూసేరు . ఆ పిల్లలు
మన పిల్లల కంటే ఎందులోనూ తీసి
పోరు . మార్గదర్శనం చేసే గొప్ప ధార్మిక
మైన ఉపాధ్యాయు లుండాలే కాని ,
ఆ పిల్లల , వారి తలిదండ్రుల కళ్లల్లో
మెరుపులు చూడగలం .
రాజశేఖరకెడ్డి పుణ్యమాని చదువుకోవా
లవుకునే వారికి అనేక అవకాశాలున్న విప్పుడు .
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
🙏🙏🙏
నిబధ్ధత గల ఉపాధ్యాయుడు పిల్లల నుండి , సమాజం నుండీ నిరంతరం గౌరవ మర్యాదలు పొందుతూనే ఉంటాడు . ఇది కేవలం ఉపాధ్యాయుల సొంతం .
ఉపాధ్యాయుడికి వృత్తిపట్ల నిబధ్ధత ఉంటే , దారం తెగిన గాలిపటాలను కూడా కూచోబెట్టి , ఆస్ట్రొనాట్స్ గా మార్చి అద్భుతాలు సృషించ గలడు .
అవును ,
ఇదొక క్రొత్త ట్రెండ్ ,
ఉపాధ్యాయుల్ని పనిచేసే ఊర్లలో కాపుర ముండ మనండి . ఉండరు . నిరంతరం
ప్రయాణం చేసే టీచరు ప్రిపేరయ్యే దెప్పుడు ?
ఓపిగ్గా బోధించడం సాధ్యమౌతుందా ?
తాను చెప్పిన చదువును మూల్యాంకనం
చేయగల్గు తున్నాడా ?
చదువు చెప్పడం కాదు , నేర్పించగలగాలి .
పిల్లలకు ఆసక్తి ఏర్పరచాలి , ప్రతి పిల్లవాడూ
తన దృష్టిలో ఉండాలి . నేను చెప్తున్నాను .
వాళ్లు నేర్చుకోవడం లేదు , అంటే , ఆ ఉపా
ధ్యాయుడు ఈ వృత్తికి పనికిరాడు . ప్రభుత్వ
పాఠశాలలలో 20 శాతం మంది పిల్లలు మాత్రమే - చదవడం , రాయడం చేయగల్గు
తున్నారంటే , నేటి ఉపాధ్యాయులకు వృత్తి
పట్ల నిబధ్దత లేదనుట నిజం . పాపం
పసి హృదయాలకు ఇదోరకం టార్చర్ .
తప్పెవరిది ?!
మీకు తెలుసా ?
1 . ప్రభుత్వపాఠశాలలకు వచ్చే పిల్లలు (వేరే ఏదారీ లేని) , ప్రొద్దున లేచి కూలీనాలీ చేసుక బ్రతికే బడుగు
జీవుల పిల్లలు , పెద్దలు పనికెళ్ళగానే వీళ్ళు దారం తెగిన గాలిపటాలు . పెద్దలకు వీళ్ళను పట్టించుకునే తీరిక కానీ , పెద్దల మాట వినే పిల్లలు అరుదనే విషయం మీకు తెలుసా ?
2 . దరిమిలా , వాళ్ళహాజరు చాల తక్కువ .
హాజరే లేక అధ్యనం యెలా ?
3 . మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉన్నా ,
హాజరు తక్కువ .
4 . కాస్త వెసులుబాటు ఉండీ లేనివాళ్ళు కూడా
ప్రైవేటుపాఠశాలలకు మొగ్గుచూపుతున్నారు .
5 . ఇరవై శాతం ప్రభుత్వ పాఠశాలలలో చదివే పిల్లలు నర్ద్వందంగా ప్రతిభావంతులు . 8 వ తరగతి నుండి ప్రైవేటుపాఠశాలలు వారి తలిదండ్రులను ప్రలోభ పెట్టి వలవేసి పట్టుక పోతారు . మిగిలేది తాలు , తరచుగా బడికిరాని పిల్లలు . గ్రామీణప్రాంతాలలో ఈ స్థితి మరీ యెక్కువ .
పరిష్కారంగా నేనొక వినూత్న ప్రయేగం సేసేను .
అరగంట ముందుగా మా ఉపాధ్యాయుల నందరినీ
ముందుగా నిర్ణయించుకున్న హేబిటేషన్ కు తీసుక వెళ్ళి , హాజరు సక్రమంగా లేని పిల్లల పెద్దలను కలిసి
చర్చించడం . ప్రతిరోజూ ఈ పని చేసేవాడిని . కొంత మార్పు సాధించేను .
6 . మీకు తెలుసా ? ఇప్పుడు ఉపాధ్యాయు లెవ్వరూ
పనిచేసే గ్రామంలో ఉండడం లేదు . వంద కి మీ లైనా ప్రయాణం చేయగలుగుతున్నారు .
నిజంగా చిత్తశుధ్ధి ఉంటే , ఉపాధ్యాయుడు తలచు
కుంటే , అద్భుతాలు సృష్టించవచ్చు .
7 . పాఠశాలకు వచ్చిళ పిల్లలకు చదువు చెప్పడం -
అదేమంత గొప్పవిషయంకాదు.
పాపం , పేదరికపు బడుగుల దారంతెగిన గాలి పటాలను కూర్చోబట్టి చదువు చెప్పే చిత్తశుధ్ధిగల ఉ
పాధ్యాయులు కావాలి .
8 . మీకు తెలుసా ? ఉపాధ్యాయులే పలు వ్యాపకాలతో ధనసంపాలనలో తల మునకలై
నేడు తీరుబాటు లేకుండా ఉన్నారు .
9 . మీకు తెలుసా ? ఉపాధ్యాయ వృత్తికి అకౌంట బిలిటీ లేదు .
10 . ఎంత సేపటికీ పిల్లలను కొట్టి భయపెట్టి , చదివించడం భేషైన మార్గంగా భావిస్తున్నారు .
ఇది తప్పుడు మార్గం . 38 దేండ్లు నేను ఈ వృత్తిలో తలపండినవాణ్ణి . నేనెప్పుడూ పిల్లలను కొట్టలేదు .
పిల్లలను దగ్గరకు తీసుకున్నాను . గొప్పగా విద్యావంతులను చేసేను . ఈ పని చేయడం ఎవ్వరికైనా సాధ్యమౌతుంది . కడుపులో కలగాలి .
ప్రతి పిల్లవాడూ మన దృష్టిలో ఉండాలి .
ఉపాధ్యాయ వృత్తి మిగతా వృత్తులకంటే భిన్నమైనది . కేవలం బెల్లూ - బిల్లూ ఇక్కడ కుదరవు .
11 . సదరు ప్రధానోపాధ్యాయుడు చేసింది నా దృష్టిలో తప్పే .
ప్రియము బంగారు రంగు జిలేబి తీపి ,
వైద్య సేవలు ఘనము , శభాషు సింగు !
కోకనాడు ఋణంబున కూరు కొనియె ,
ఘనము వాత్సాపు కథనము కాపి పేష్టు .
( వాట్సప్ కాపీ పేష్టు కానేకాదు )
పురుషోత్తముడని రాముని ,
తరుణీమణి యని జగంబు ధరణిజను , మహ
త్తర లోకోధ్ధరణ కొఱకు
ధరపయి జన్మించిరనుచు , తాపసు లనరే .
ముందుగా వారికి వినిపించే ,
ఇక్కడ ప్రకటిస్తున్నారేమో సార్ !
నేడు మహిళా దినోత్సవ
' మాడు మహోదయు ' లకు శుభ మంగళము బుధా !
వేడెద మహిళా మణులను
చేడియలు పురుషులు ప్రేమచే ముడివడగన్