శ్యామలీయం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మా అన్న పాట సీనియర్ నందమూరి తారకరామారావు హీరోగా వచ్చిన "జగదేకవీరుని కథ" సినిమా లోనిది. పింగళి నాగేంద్రరావు గారి పాటకు పెండ్యాల నాగేశ్వరరావు గారు బాణీ సమకూర్చగా సుశీల, లీల ఆలపించారు. ఈపాటలో నృత్యం చేస్తూ పాడిన నటీమణులు బి.సరోజాదేవి, జయంతి, బాల, ఎల్. విజయలక్మ్మి.
గమనిక: కొద్దిరోజుల తరువాత శ్యామలీయం బ్లాగు పూర్తిగా కనుమరుగు కావచ్చును. నా వెబ్ సైటును శోధినిలో జతపరుస్తానని హామీ యివ్వలేను. కాబట్టి ఆసక్తి కలవారు https://syamalarao.in/ అనే నా కొత్త సైట్ చిరునామాను నోట్ చేసుకోగలరు.
కీర్తన చిన్నదంటే చిన్నదే అనుకోవచ్చును పల్లవి + రెండు చరణాలు మాత్రమే నిడివి కాబట్టి. ఖండగతిలో నడుస్తుంది కాబట్టి సులువుగానే శ్రుతిసుభగంగా పాడుకోవచ్చును. మీరన్నట్లు పూజావసానసమయంలో గీతం శ్రావయామి అనవచ్చును దీనితో.
<br />నేను ఈమధ్య చాలా నెలలపాటు తెలుగుబ్లాగులను వదలిపెట్టి నిజంగా చాలా చాలా హాయిగా ఉన్నాను. ఎక్కువమంది అడుగుతున్నారని నా బ్లాగును మళ్ళా పబ్లిక్ చేసి బ్లాగ్లోకం లోనికి వచ్చాను. అది చాలా పెద్దపొరపాటే అని గ్రహించాను. ఇక్కడ ఈ రాజారావు, జిలేబి అనే ఇద్దరు వ్యాఖ్యావీరులు నిత్యం అదేపనిగా నిరంతరాయంగా నామీద రాళ్ళువేస్తుంటే మిగిలిన అందరు తమతమ ఒళ్ళు కాపాడుకోవాలని దూరంగా కూర్చుని వినోదం చూస్తున్నారు మౌనంగా. ఆ
అజ్ఞాతలకు ఇక్కడ నా ప్రసక్తి ఎందుకో అర్ధం కాదు. ఇక్కడి టపా విషయం ఏమిటో దానికి సంబంధించి మాట్లాడితే చాలు కదా? ముఖం దాచుకొని తెరచాటున కూర్చుని ఎక్కడబడితే అక్కడ సందర్భం లేకుండా మాట్లాడే అల్పులకు జవాబులు ఎందుకు చెప్పాలి? నేనెన్నడూ పండితుడనని చెప్పుకోలేదు. ఎవరైనా పొరపాట్లు చేస్తుంటే చెప్పటం ఎలా తప్పవుతుంది? దీర్ఘచర్చల వలన ప్రయోజనం ఏముంది? నేనెక్కడా యెప్పుడూ అవినయంగా మట్లాడలేదు కదా? నా పేరు ఎత్తి మాటాడే వారు తమ పేరూ ఊరూ దాచుకొని నాపై నిందలు వేయటం ఏమి సంస్కారం? మూర్ఖుల మనసు రంజింపరాదు కాబట్టి వ్యర్ధచర్చలను నిలిపివేయక తప్పదు.
23 మార్చి, 2026 10:28 PM సమయంలో వ్యాఖ్య చేసిన అనామకు లెవరో తెలిసిపోతూనే ఉంది. అనవసరంగా బోలెడు వివరణ వ్రాసాను.
<br /><br />ఈపద్యం రెండవపంక్తిలో దోషం ఏమీలేదు. <br /><br />పద్యమ్ము <br />రసము చిప్పిల్ల వ్రాయవలయు<br />రసవిహీన మైన గులక రాళ్ళ ప్రోగు<br /><br />అని అన్వయం బహుసుభగం గానే ఉంది.<br /><br />రాజారావు గారి పద్యాలలోని గుణదోషాలను గురించి చెప్పిన మాటలు చదివి కూడా ఇలా వ్రాసారంటే ఏమనుకోవాలి? <br /><br />ఆయనకు తెలుగులో ప్రాథమికమైన పలుకుబడియైన సంధుల అవగాహనయే లేదు. ఉత్వసంధి యేదో వ్యాకరణరహస్యం ఆనుకుంటారు!
అర్ధమైన దండీ.
సర్వజ్ఞుల మని భావించుకొనే మీకు పొగడ్తలు తప్ప మరేమీ రుచించవని గ్రహించాను.
ఇక పొరపాటున కూడ తమరిని ఉద్దేశించి మాటలాడను. నిరుపయోగమైన పని చేయటం నాకూ అవసరం కాదు.
మీరూ మీ మిత్రులూ నిత్యం పరస్పరం కీర్తించుకుంటూ హాయిగా ఉండండి.
పద్యాలు చాలా బాగున్నా యండి.
చిన్న సూచనలు, మీరు అన్యథా భావించవద్దు.
త్రిలోకైకారాథితనామ యని ఉండాలి.
శ్రీలొసగు సదా యంటే మరింత యొప్పిదంగా ఉంటుంది.
తెలుగుపద్యాలలో విరామచిహ్నాలు ఉంచటం అవసరం లేదు.
అవి ఉంచటం ఐతే తప్పేమీ కాదు.
అభినందనలు.
నాపని నేను చేసుకుంటూ వెళ్ళటమే నాకర్తవ్య మండీ. <br /><br />నది ప్రవహిస్తూ వెళ్ళే క్రమంలో మైదానాలూ లోయలూ వనాలూ ముళ్ళపొదలూ మరుభూములూ పర్వతాలూ వంటివి ఎన్నెన్నో ఎదురౌతూనే ఉంటాయి. ప్రయాణం ఐతే ఆగదు కదా. కొన్ని సార్లు అడ్డంకులు తొలగిపోతాయి మరి కొన్ని సార్లు నదియే తప్పుకొని ముందుకు సాగుతుంది. <br /><br />సహజమైన దానికి విచారం లేదు. వేదన అవసరం లేదండి.
అబ్బురపరచే విషయం. ఈ కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయం ఇంకా సజీవంగానే ఉందా? ఈయన కథ చదివి నాకూ ఈవయసులో సంస్కృతం నేర్చుకోవాలని అనిపిస్తోంది.
ఈవిషయమై రెండు మూడు టపాలు వ్రాయాలని అనుకున్నాను. కాని విషయం చాలానే టపాలుగా వచ్చేలా ఉంది.
మనదంతా కంఠశోషగానే ఉంటోందండీ.
ఎందుచేతనో తెలియదు కాని నాకొక విధమైన వైమనస్యం కలిగింది ఏకంగా భద్రాచలక్షేత్రం పైనే. అక్కడ సీతారాములకు పూజలే జరుగనప్పుడు సీతారాములు అక్కడ ఉంటారా అనిపించుతోంది.
ఆకారణంగానే నేమో నానుండి వెలువడిన రామకీర్తనలలో భద్రాద్రిరాముడిగా భావించిన సందర్భం ఇన్ళేళ్ళలో ఒకటీ లేదు.
గత డిసెంబరులో అన్యమనస్కంగానే మిత్రులు పిలిస్తే వారితో భద్రాచలం వెళ్ళాను. క్షేత్రంలో అడుగుపెడుతూనే సీతారాములకు జరుగుతున్న అపచారమే మనసులో మెదిలి వచ్ఛిన కీర్తనను మీకు ఉదయం పంపాను. ఇదొకటే భద్రాచలాన్ని ప్రస్తావింఛి నానుండి వెలువడిన కీర్తన. ( https://syamaliyam.blogspot.com/2025/12/blog-post_18.html )
సీతారాములను ఇలా ఆవమానిస్తున్న వాళ్ళకు శిక్షపడాలి.
మాష్టారూ,
ద్రోణాచార్యులకు ద్రోహబుధ్ధి ఏమిటండీ? మీరూ సినిమాల భారతాన్నే ప్రమాణం అనుకుంటే ఎలాగండీ? తనను వధించటానికే యజ్ఞసముధ్బవుడైన ధృష్టద్యుమ్నుడిని శిష్యుడిగా స్వీకరించిన మహాత్ముడు ద్రోణాచార్యుడు.
విశేషంగానో సాధారణంగానో కొంతగా నైనా సహజప్రజ్ఞ లేనిది రావటం కష్టం.
OK. I will not delete this post.<br />(నోట్: ఇపుడు వ్యూస్ చూస్తే Yesterday 2454 అని చూపిస్తోంది stats పేజీలో. No more updates on the stats post going forward.)
సనాతనధర్మాన్ని అవహేళనచేయటం కోసం వెలువడే ఇలాంటి రచనలను ఎదురుకొని దుష్టువ్రాతలకు శిక్షలు వేయించేందుకు పూనుకొనేవారే కనిపించటం లేదు. అది ఈ కుహనా మేథావులకు ఒక వరం లాగా పనిచేస్తోంది. <br /><br />ఇతర మతాల గురించి కాని, ఆమతాల గ్రంథాలలోని పాత్రల గురించీ వీళ్ళు చచ్చినా ఒకముక్క కూడా వ్రాయటానికి సాహసించలేరు. కారణం అందరికీ తెలిసినదే.
మంచి ఆలోచన. రామకార్యం. నాసమర్దత సందేహాస్పదమే. ఐనా రామప్రీతిగా శక్తికొలది అవశ్యం చేయవలసినదే.<br /><br />ప్రస్తుతం ఇంకా దెబ్బలనుండి కోలుకొనే స్థితిలోనే ఉన్నాను. రామానుగ్రహం మేరకు వీలై నంత త్వరగా మొదలుపెడదాము.<br /><br />మంచిఆలోచన ఇచ్చినందుకు ధన్యవాదాలండీ.