శ్యామలీయం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
అంత స్వాతిశయం బాగోదు. ఈ వ్యాసం కన్నడ లిపిలో కన్నడ భాషలో కన్నడ బ్లాగులో ఉంటే బాగుంటుంది. తెలుగులిపిలో తెలుగుభాషలో వ్రాసి తెలుగు బ్లాగులో అచ్చు వేసారు. సరే, ఈ వ్యాసంలో కన్నడ అన్నమాట స్థొనంలో తెలుగు అని ఉంచినా సరిగానే ఉంటుంది. బహుశా కన్నడ బదులు తెలుగే కాక వేరే భాష పేరును కూడా వాడవచ్చునేమో. ఈ వ్యాసంలో భాషా దురభిమానం తొంగిచూస్తోందని అనుమానం కలుగుతోంది.
ఒకసారి ఆలోచించండి. బ్లాగు టపాల లోని విషయాలమీద జరిగిన చర్చల కన్నా టపాకు ఏమాత్రం సంబంధం లేని విషయాలను లాగి నిందాలాపాలతో ఆవేశకావేషాలతో రంకెలు వేస్తూ చేసిన వ్యర్ధ చర్చలే తొంభైశాతం ఉంటే ఆ చర్చల వలన బ్లాగులకు ఏమి ప్రయోజనం? చదువరులకు ఏమి ప్రయోజనం? కేవలం పనిలేని కాలక్షేపం రాయుళ్ళ వలన బ్లాగు లోకం చెడింది! ఇక్కడ బ్లాగర్ల బాధ్యతా రాహిత్యం కూడా మిక్కుటంగా ఉంది. వాళ్ళూ మోడరేషన్ చేసి చెత్త వ్యాఖ్యలను నిరాకరించకపోవటం ఈదరిద్రానికి ముఖ్య కారణం. ఇప్పుడు ఎంతవగచీ ఏమీ లాభం లేదు కదా. చెత్త బ్లాగులూ చెత్త వ్యాఖ్యలు రాజ్యం చేసే చోట పాఠకులు ఆ చెత్త కోసం రారండి.
శ్యామలీయం బ్లాగు ప్రస్తుతం ప్రైవేటు బ్లాగు. వీలు వెంబడి పబ్లిక్ చేయాలి. కొన్ని కారణాలవలన నాజీవితం అల్లకల్లోలంగా ఉంది. అందుకని కొన్ని వ్యాసంగాలు కష్టంగా ఉన్నాయి.
కొందరు ఒక వ్యాఖ్యనే వంద చోట్ల అతికిస్తూ ఉంటారు. అవి వ్యాఖ్యలు పేజీని ఆక్రమించి వేస్తాయి. అందుచేత ఒక వ్యాఖ్య కాపీని మాత్రమే ప్రచురించితే చాలును.
మరొకటి.
4. చేట భారతం వ్యాఖ్యలను గురించి. వ్యాఖ్య ప్రదర్శనకు నిడివి పరిమితి విధించటం.
మంచి మార్పులు!
మరి కొన్ని మార్పులు వీలైతే పరిశీలించండి
1. ఒక టపాకు సంబంధించి పరిమిత సంఖ్యలోనే వ్యాఖ్యలు చూపటం.
2. ఒక వ్యాఖ్యాత నుండి పరిమితసంఖ్యలోనే వ్యాఖ్యలు చూపటం.
3.పునరుక్తి వ్యాఖ్యలను పరిహరింఛటం.
చక్కని టపాలు వ్రాస్తున్న బ్లాగర్లు మీద వ్యాఖ్యలు యుధ్ధం ప్రకటించి వారిని విరక్తితో బ్లాగులోకం నుండి తప్పుకొనేలా చేసిన సంఘటనలు చూసాను. టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్యలతో గోలగోలగా జరిగిన నిరుపయుక్తచర్చలను చూసాను. ముసుగులో దాగి సుదర్భశుధ్ధి లేకుండా నీచవ్యాఖ్యలతో నిందాలాపాలు చేషేవాళ్ళని చూసాను. ఒక ప్రచారవ్యాఖ్యను వందచోట్ల అతికించి ఆగ్రిగేటర్ పేజీని అక్షరాలా తినే వాళ్ళను చూసాను. భజనసంఘాల వ్యాఖ్యలను చూసాను.
ఇటువంటి వెలపరం కలిగించే వ్యాఖ్యలు దున్నేసే బ్లాగులోకం లోనికి ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది రండి అని ఎవరినైనా ఆహ్వానించే పరిస్థితి ఉందంటారా?
ఇంత రొట్ట వలన చెడ్డపేరు వస్తున్నప్పుడు ఆకలుపుదొడ్డిని ప్రదర్శించటం అవసరం కాదనుకుంటాను.
సీరియస్ బ్లాఖర్లకూ సీరియస్ రీడర్లకూ ఈరొట్ట నిరుత్సాహం కలిగిస్తుంది కదా.
నచ్చిన టపా చదివి అవసరం అనుకుంటే అభిప్రాయం వ్రాయటం మంచిది.
వ్యాఖ్యలు ఏవైనా మంచివే అనుకుంటే చెప్పేందుకు ఏమీలేదు.
వ్యాఖ్యలు విలువ లేనివి అని నా ఉద్దేశం కాదండీ. యుధ్ధాల కోసం కొందరూ చెత్త పోయటం కోసం కొందరూ వాడటం శోచనీయం అనే నా బాధ. మీ యూట్యూబ్ ఉపమానం అంత exact కాదనుకుంటాను. వ్యాఖ్యలు చూసి వీడియోని చూడం కాబట్టి. ఇకపోతే ఆగ్రిగేటర్ కోసం అడపాదడపా maintenance కోసం సమయం వెచ్చించాలి అనే నా భావం.
మన వాళ్ళకు సినిమాలూ రాజకీయాలూ క్రికెట్టూ తప్ప ఇతర విషయాలపై ఆసక్తి లేదు. అందుకే బ్లాగులు చచ్చిపోతున్నాయి. ఆగ్రిగేటర్లు కూడా అందుకే చచ్చిపోతున్నాయి. శ్రీనివాస్ గారు అన్నమాటలు ముమ్మాటికీ నిజం.
మరొక్క విషయం. మీరు అనుకుంటున్నట్లుగా ఈశ్లోకం ద్రౌపది చెప్పిన మాటలలోనిది కాదు. ద్రైపదిని సమర్ధిస్తూ భీమసేనుడు మాట్లాడిన తరువాత అతడితో ధర్మరాజు అన్నమాటలలోనిది ఈశ్లోకం.
సహసా విదధీత. . . .
ఈ శ్లోకానికి ఎమెస్కోవారు ప్రచురించిన పుస్తకంలో డా. కె.వి. సుందరాచార్యులు గారు వ్రాసినది అందిస్తున్నాను.
ప్రతిపదార్ధం. సహసా = ఆలోచించకుండా అకస్మాత్తుగా, క్రియాం = కార్యాన్ని, న విదధీత = చేయరాదు, అవివేకః = ఆలోచన లేకుండా చేయటం, పరమాపదాం = గొప్ప ఆపదలకు, పదం = స్థానం (కారణం) అవుతుంది, హి = ఎందువల్ల నంటే, గుణలుభ్ధాః = శౌర్యవీర్యాది గుణాలను ఆశించేవి, సంపదః = ఐశ్వర్యాదులు, స్వయం = తమంతతామే, వృణుతే = పొందుతున్నవి.
తాత్పర్యం. ఒకపని చేయదలచి నప్పుడు దాని లాభాలాభాలు ఆలోచించుకొని చేయాలి. ఆలోచించకుండా చేసేవారు దుఃఖాన్ని పశ్చాత్తాపాన్ని కూడా పొందుతారు. ఆలోచించి పని చేసినవారు ఎప్పుడు సుఖాన్నే పొందుతారు. వారికి కష్ట మెప్పుడూ రాదు. ఆలోచన లేకపోవటం దుఃఖానికి మూలకారణం. సంపదలెప్పుడూ ఆలోచించి పనిచేసే వారినే పొందుతాయి.
".లోకాన్ని పాలించే పరమేశ్వరుని రంగు కూడా నలుపే"
పొరపాటు.
పార్వతీ పతి తెల్పు పాలసంద్రము తెల్పు
అని తెలుపు రంగు పద్యం. పూర్వం ఎక్కాల పుస్తకాలలో అన్ని రంగుల పద్యాలు ఉండేవి.
ఇపుడు ఎక్కడ చూచినా నీలంరంగు శివుడి ఫోటోలే. ఖర్మూ
I am not born yesterday!
మీరే చాలా తప్పుగా వ్రాసారు.
స్త్రీత్వాన్ని అవమానించిన వ్యక్తిని వయసు చూసి గౌరవించాలని అడుగుతున్నారు. భావ్యం కాదు.
జూనియర్లను చూసి మీరు జాలిపడటం ఇక్కడ అప్రస్తుత ప్రసంగం. ఈ సీనియరు గారి దుష్ప్రవర్తన చూసి సమర్ధించుతున్న మిమ్ముల్ని చూసి జాలిపడవలసి ఉంది.
శర్మ గారూ,
మీ సౌలభ్యం కోసం చెబుతున్న మాట. వ్యాసుల వారి మహాభారతం ఆదిపర్వంలో 110వ అధ్యాయం పేరు "కర్ణసంభవం". అది కేవలం నలభై శ్లోకాలు నిడివి గల వృత్తాంతం. వీలు చూచుకొని పరిశీలించండి.
కం. ఏనుగు ఠీవిని కనుగొని<br />శ్వానంబులు భయము చేత భౌభౌ మనినన్<br />మానవిహీనశ్వానా<br />యేనుగునకు పరువు తక్కువేమిర భ్రష్టా.
నాకు వేటూరి గారిపై ప్రత్యేకంగా అభిమానం ఏమీ లేదండీ. ఏదో ఒక కోణంలో శివుడికి తరుణోపాయం చెప్పగల కవి అని వేటూరిని సమర్ధించడం నాకు వీలు కాదు. ఇక్కడ నిందాస్తుతి అనటం ఎంతమాత్రం పొసగదు.
మూలం చదవండి. తెలుగువివరణలతో సహా వ్యాసభారతం గోరఘ్ పూర్ గీతాప్రెస్ నుండి తెలుగులిపిలో లభిస్తోంది. ఎకసెక్కాలు ఆడటం వంటి పిచ్చిమాటలు మీ అపోహనుండి పుట్టినవి. గ్రహించగలరు.