శ్యామలీయం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
చెట్టు పుట్ట గుట్ట లెట్టివి మనుజుడు<br />పుట్టు మనుటవలన పుట్టచున్నె?<br />పట్టుబట్టి మనిషి వాటిని తొలగించ!<br />పరమధూర్తజాతి నరులజాతి.
ఐదేసి మాత్రలకు విరుగుతూ ఖండగతిలో వస్తుందండీ. <br />శ్రీరామ । మారాథ్య । పాదుకం । కారుణ్య । వారాన్ని । ధిం భావ । యే<br />అని గానసౌలభ్య విభజనను దృష్టిలో ఉంచుకుంటే సరి. చివరన ఉన్న గురువును తాళప్రయోజనానుసారిగా కొనసాగించుకోవచ్చును. ఈపాదంలో శ్రీరామ । .... ..... । వారాన్ని । అన్నది గమనించండి. ప్రాసయతి వాడబడింది. అందుచేత అక్కడ కొంచెం విరామం ఇస్తే మరింత అందగిస్తుంది.
సీతారామ్, ఈకీర్తన నీకు నచ్చినందుకు అనేక ధన్యవాదాలు. అంతా రామానుగ్రహం వలన వచ్చినది కాని నాఘనత అంటూ ఏమీ లేదు. నాకు సంస్కృతం ఏమీ రాదు. అన్ని ముక్కలూ రాముడు నానోట పెట్టి వ్రాయించినవే కాని నేనెంతవాడను. సర్వం శ్రీరామానుగ్రహం!
మీరన్న మాటల్లో చెప్పాలంటే, నాకు మెదడు ముఫ్ఫైలోనూ ఆరోగ్యం అరవైలోనూ మనసు తొంభైలోనూ ఉన్నట్లుగా తోస్తున్నది. ఇంకా ప్రోగ్రాములు వ్రాసుకుంటూ ఉన్నాను, మందులు మితంగానే వేసుకుంటున్నాను. కాని ప్రపంచం పట్లు విరక్తి అపరిమితంగా ఉంది.
నాకు కళ్ళకు జూన్ జూలై నెలల్లో చేసారు - సంవత్సరం క్రిందట. శారద అంత అనారోగ్యపరిస్థితిలోనూ నాప్రక్కనే ఉండి చేయించింది. ఆవీల్ ఛైర్ మీదే గంటలుగంటలు ఓపిగ్గా కూర్చుంది పాపం. అది సరే, కానీ అప్పుడే శిరస్నానం చేసారే! కొంచెం ఆగవలసిందేమో. చుక్కల మందులు నెలవరకూ వేసుకోవాలి కాని అవసరం ఐతే మరో పక్షంరోజులు వేసుకోవాలి. ఈరోజుల్లో కేటరాక్ట్ సర్జరీకి నొప్పి అంటూ ఏమీ ఉండదస్సలు.
ఈ కీర్తనలో ప్రతిపంక్తిలోనూ హరేరామ హరేరామ అని పునరావృతం అవుతూ వస్తుంది. ఇలా ప్రతిపంక్తినోనూ నాలుగుసార్లు హరినామస్మరణం చేయటం వలన కీర్తన మొత్తం పదునాలుగు పంక్తులకూ వెరసి యాభైయారు సార్లు నామస్మరణం చేసినట్లు అవుతుంది. విస్తరించి పాడటం ద్వారా అది యెంతైనా కావచ్చును. పంక్తులన్నీ రెండుసార్లు పాడబడితే అష్టోత్తరశతనామస్మరణం అవుతుంది. ఎవరి ఆసక్తికొలదీ వారు ఎంతైనా విస్తరించుకొని గానం చేసుకొనవచ్చును.
కాదులెండి.<br />నాలుక పైన వంక పెట్టి మనసునే అనటం.<br />దాపరికం ఏమీలేదు.
శయనసమయకీర్తన. అందునా అక్షరాక్షరగండంగా టైపుచేసే మొబైల్ కీబోర్డు సహాయంతో తంటాలు. టైపో లు అపుడప్పుడు నడిపోతున్నాయి. ఒకో సారి నిద్ర కళ్ళకు వాటిని పసికట్టటం కష్టం అవుతోంది.
ధన్యవాదాలు సీతారామ్.<br />ఈ శయనసమయకీర్తన నీకు నచ్చినందుకు చాలా సంతోషం.
చదివి సానుకూలంగా స్పందించి నందుకు మీకు నేనే అనేక ధన్యవాదాలు చెప్పుతున్నానండీ. <br /><br />ఇతర రామకీర్తనలను కూడా పరిశీలించి మీ ఆమూల్యాభిప్రాయాలను చెప్ప ప్రార్ధన.
ఈటైపో పుణ్యమా అని మౌనపాఠకవరేణ్యులు ఒకముక్క అన్నారు. సంతోషమండీ.
వామపక్షం మరియు ప్రజాతంత్రం అనేవి కలిసి ఉండే భావజాలాలు కానేకావే! వామపక్ష ప్రజాతంత్ర ఏమిటి అసందర్బం. ఇది పచ్చిమోసకారీ మాటే. ఏకమ్యూనిష్టు ప్రభుత్వమైనా ఏదేశంలోనైనా ప్రజాస్వామ్యం పాటించిందా?
ఎంటర్టైన్మెంట్ ఒక్కటే పాయింట్. ఈమాట నిజమే. కాని దాని రూపస్వభావాలు కాలానుగుణంగా మారతాయి. నాటకాలు పోయి సినిమా. రేపు సినీమా పోయి మరొకటి రావచ్చును. సినిమాను చిరంజీవి అనుకోవటం పొరపాటు కావచ్చును. ఏఐ కారణంగా సినీమా కొద్దోగొప్పో మారవచ్చును. ఏఐ పోయి మరొకటి వస్తే అది సినీమాపై మరింత ప్రభావం చూపవచ్చును. సినీమాను జనం రిసీవ్ చేసుకొనే విధానం మారుతోంది కాబట్టి సినీమా టేకింగ్ కూడా కాలానుగుణంగా మారకతప్పదు.
ఇకపోతే ఎక్కువ పెట్టుబడి లేదా ఎక్కువ స్క్రీన్స్ మీద రిలీజ్ ఐనంత మాత్రాన పెద్దసినిమా కాలేదు. జనాదరణే కొలబద్ద. కలెక్షన్ డివైడెడ్ బై ఇన్వెష్ట్మెంట్ విలువే నిజమైన సక్సైస్ ఇండెక్స్.
ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మా అన్న పాట సీనియర్ నందమూరి తారకరామారావు హీరోగా వచ్చిన "జగదేకవీరుని కథ" సినిమా లోనిది. పింగళి నాగేంద్రరావు గారి పాటకు పెండ్యాల నాగేశ్వరరావు గారు బాణీ సమకూర్చగా సుశీల, లీల ఆలపించారు. ఈపాటలో నృత్యం చేస్తూ పాడిన నటీమణులు బి.సరోజాదేవి, జయంతి, బాల, ఎల్. విజయలక్మ్మి.
అర్ధమైన దండీ.
సర్వజ్ఞుల మని భావించుకొనే మీకు పొగడ్తలు తప్ప మరేమీ రుచించవని గ్రహించాను.
ఇక పొరపాటున కూడ తమరిని ఉద్దేశించి మాటలాడను. నిరుపయోగమైన పని చేయటం నాకూ అవసరం కాదు.
మీరూ మీ మిత్రులూ నిత్యం పరస్పరం కీర్తించుకుంటూ హాయిగా ఉండండి.
అదృష్టవంతులు మీరు. అభినందనలు. గురువుకు శిష్యులు బిడ్డలే. సందేహం లేదు. మీఆనందం అర్ధం చేసుకోగలం. పద్యాలు బాగున్నాయి.