శర్మగారికి వ్యంగ్యం పాలు ఎక్కువయ్యి బాలమురళి గురించి రాసింది నేను కల్పించి రాసాని అపోహ పడుతున్నారు. ఆయన (బాలమురళి) అన్న మాటలే రాసాను. రికార్డింగ్ ఉంది.
త్యాగరాజు 1847లో పరమపదించాడు. దాదాపు 180 సంవత్సరాలు కావొస్తోంది. ఈ కాలంలో ఏ కచేరీకెళ్ళినా త్యాగరాజ కీర్తనలు కనీసం 3 లేదా 4 అయినా పాడకుండా కచేరీలు జరగవు.
లేదంటూ, శర్మ గారు ఉదాహరణలు చూపించినా ఆశ్చర్యపోను.
తమిళనాడులో ఇలాంటి ప్రయోగాలు (త్యాగరాజు కృతులు లేకుండా) కొంతమంది చేసి విఫలం అయ్యారు.
త్యాగరాజు అన్ని మేలకర్త రాగాలనీ చిలకరించి ఎన్నో జన్యరాగాలు సృష్టించాడు.
ఒక్క తోడి రాగంలోనే 20కి పైగా కీర్తనలున్నాయి.
అంకెల గారడీ ఎందుక్కానీ, ఆయన తదనంతరం ఎంతో మంది వాగ్గేయకారులు (బాలమురళితో సహా) కొన్ని కీర్తనలు లేదా కృతులు కట్టినా అవి జన బాహుళ్యంలోకి వెళ్ళినవి వేళ్ళతో లెక్కపెట్టచ్చు.