Srinivas Vuruputuri తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;Srinivas Vuruputuri

కొడవళ్ళ హనుమంతరావుగారికి, కె.వి.యెస్.రామారావుగారికి, మంథా వీరభద్రంగారికి, తఃతః గారికి, చదివి వెన్ను తట్టినందుకు ధన్యవాదాలు.

1. ఇతర భాసనాటకాలను కూడా అనువదించాలనే ఆలోచన ఉన్నదండీ, ప్రయత్నిస్తాను. అన్నట్లు, అల్లప్పుడెప్పుడో, చందమామలో ప్రచురించిన భాసకథల గురించి చెప్పి, కుతూహలాన్ని కలిగించిన క్రెడిటు మీకే.
2. ఫార్మాటింగ్ గురించి: మూలం– అనువాదం రెండు కాలమ్స్ ‌గా వేయాలని అనుకున్నాము. కానీ ఫోన్లోనో, ట్యాబులోనో చదివే పాఠకులకు కష్టమవుతుందని ఆ ఆలోచనను విరమించుకున్నాము.
3. వీరభద్రంగారు చెప్పినట్లు “సింగంబాకట…”పద్యంలో కుంతీసుతమధ్యముడనే మాటను “సమరస్థేమాభిరామాకృతి” అయిన అర్జునుడికి వాడారు తిక్కన. అదెట్లా అని సందేహం కలిగి తి.తి.దే.వారి భారతం చెక్ చేసాను. “కుంతి కొడుకులు నిజానికి ముగ్గురే. వాళ్ళలో నడిమివాడు భీముడు. కాని కుంతి అట్లా అనుకొనలేదు. మాద్రీపుత్రులైన నకుల, సహదేవులనూ తన సొంతకొడుకులు అనే అనుకొన్నది. అందుచేత కౌంతేయులన్నా పాండవులన్నా ఒక్కటే! కాగా, ఐదుమందిలో మధ్యవాడూ అర్జునుడే. ఇట్లా అని వ్యాసుడే అన్నాడు. దాన్నే తిక్కన పాటించాడు,” అని వ్యాఖ్యానంలో చెప్పారు. భాసుడి భీముడు “భ్రాతౄణామపి మధ్యమః” అని చెప్పేసాడు.
4. తఃతః గారు చెప్పినట్లు వ్యాయోగపు కథాకాలం ఒక పగలును మించకూడదు (“వ్యాయోగస్తు ఏకాహకృతః”). నేను మిస్ చేసాను.

మరోసారి కృతజ్ఞతలతో
వురుపుటూరి శ్రీనివాస్


28 May 2026 12:32 PM