Vanitavanivedika.blogspot.com తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఒకే తల్లితండ్రులకు పుట్టిన అన్నదమ్ములకు ఒకే తల్లితండ్రులకు పుట్టిన అక్కచెల్లెళ్లను ఇచ్చి వివాహం చేయరాదని శాస్త్రంలో చెప్పారో లేదో నాకు తెలియదు గానీ, ఇలా చేయరాదని లోక నానుడి ఉంది. పెద్దలు దీనిని ఒప్పుకోరు.
ఇక రామాయణంలో ఈ వివాహ విషయం పరిశీలిస్తే - జనకుడు తనకి లభించిన కూతురు సీతను, దశరధుడు కౌసల్యల సంతానమైన రాముడికి,
తన సంతానమైన ఊర్మిళను సుమిత్రకు పుట్టిన లక్ష్మణుడికి,
తమ్ముడు కూతుళ్లు అయిన మాండవిని కైక కొడుకు భరతుడికి, శ్రుతకీర్తిని సుమిత్ర కొడుకు అయిన శత్రుఘ్నుడుకు ఇచ్చి వివాహం చేశారు.
గమనించండి, ఇక్కడ ఒకే తల్లితండ్రులకు పుట్టినవారిని ఒకే తల్లితండ్రులకు పుట్టినటువంటి పిల్లల్ని ఇవ్వలేదు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీరు అన్నదమ్ములైనా వారి తల్లులు వేరు. తల్లులు తేడా వలన జనక మహారాజు తన కూతురును, తమ్ముడు బిడ్డలను ఆ అన్నదమ్ములకు ఇచ్చి వివాహం చేసెను. ఇక్కడ లోక విరుద్ధమైన పని ఏదీ లేదు, ఉండదు.
Btech చదువుతున్న మీరు శ్రద్ధగా పోస్ట్ చదివినందుకు నా అభినందనలు...మీరు నన్ను అడిగిన ప్రశ్నకు మీ అమ్మ గారు బహుచక్కగా సమాధానం చెప్పేవారు.
సృష్టి ధర్మంలో ప్రకృతి మనకు ప్రసాదించిన పర్యావరణాలు ..అందులో విషజంతువులు..వృక్షాలు ఉంటాయి.. మనకు అవి తెలుసుకునే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. మన ఆత్మశక్తితో మంచి చెడు తెలుసుకోవాలి.
చెడు లేనిదే మంచి లేదు.. చీకటి లేనిదే వెలుతురు లేదు అంటారు కదా!చెడు ఉన్నప్పుడే మంచిని తెలుసుకుంటాము..అంధకారం లో ఉన్నప్పుడే వెలుతురుకై ఆరాటపడతాము.
చెడ్డవారిలో భగవంతుడు ఉండడా !అని అడిగారు. ఉంటాడు.. కానీ వారు చేసే కర్మలు ఆయనకు అంటవు. విష జంతువులు.. పామును దేవతగా పూజిస్తాం.. కానీ అది హాని చేస్తుందని ఎరుకలో ఉంటాం.అలాగే..
స్నేహం చేయండి.. 'ఎరుక'లోఉండండి. మీరు ఎలా ఉండాలన్నది అది మీ నిర్ణయం.
మీరు మీ గురించి తెలుసుకోండి. మీ మిత్రులు తో మీ సంబంధాలు ఎలా ఉంటున్నాయో..మీ ఆలోచనలు ఎలా సాగుతున్నాయో గమనించి ఎరుకలో (తెలివి)ఉండండి.
మీలో పాజిటివ్ నెస్ ..అన్నీ పాజిటివ్ గా స్పందించడం నేర్పుతుంది.
భగవంతుడు హృదయ నివాసి..ఎరుకలో ఉండి మంచి చెడులు గ్రహించి జీవించమని మనకు అనేక అవతారాలలో బోధించాడు..
మీ ప్రశ్నకు నా సమాధానం "ఎరుకలో " నిన్ను నీవు తెలుసుకుంటూ ...జీవితం గురించి అవగాహన తో పయనం సాగించండి..సుఖీభవ...
భగవద్గీత పారాయణం లో మీ ప్రశ్నలకు సమాధానం సవివరంగా తెలుసుకోగలుగుతారు...కర్మ..అకర్మ..వికర్మ ల గురించి పారాయణం చేసి తెలుసుకోండి...
శ్రీ గారూ, రుక్మిణి గారూ, భారతి...మీ చక్కటి స్పందనలకు నా ధన్యవాదములు...
శ్రీ మహావిష్ణువు అవతారాలలో రామావతారం... కృష్ణావతారం..విశిష్ఠమైనవి.వీరిరువురూ లీలామానసచోరులే. కష్టాలు పడడం..అనే పోలిక లేదు.కానీ నా పరిజ్ఞానం మేరకు....
బ్రహ్మ ను రావణుడు దేవ ,దానవ ,యక్ష ,గంధర్వాదుల చేతిలో చావు లేకుండా వరం కోరాడు. అనుగ్రహించాడు బ్రహ్మ. 'మానవుల పట్ల చులకన భావంతో రావణుడు మానవుని చేతిలో చావు లేకుండా ఉండడం' కోరలేదు.
బ్రహ్మ అనుగ్రహించిన వరం వలన రావణుడు లోక కంటకుడై దేవతలు.. గంధర్వులను ఇబ్బందులకు గురిచేస్తుండగా వారు మహావిష్ణువు కు మొరపెట్టుకున్నారు.. రావణ సంహారార్ధం మహావిష్ణువు మానవుడు గా రామావతారం దాల్చాడు.ధర్మ పాలన చేస్తూ..తండ్రి మాటకై అడవులకు వెళ్ళుట మొదలు అన్ని కష్టాలు మానవుడిగా చివరి వరకూ రామచంద్రమూర్తి అనుభవించాడు.
సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం చేసేవరకు అన్నీ కష్టాలే.ఆ తదుపరి కాలపురుషుడు రాముడు కి బ్రహ్మ గారి సందేశం తెలుపుతాడు.రామావతారం యొక్క విశేషం తెలుపుతాడు..సదా ప్రజా హితాన్ని కోరే శ్రీ రామచంద్రుడిని ప్రజలందరూ దేవుడు గా కొలిచారు.తమ పాలిట దైవం అనేవారు. రామయ్యే కష్టాలు ఎక్కువ అనుభవించి ..ఆ కష్టాలను ఎలా అధిగమించాలో..ఆదికావ్యం లో మనకు నేర్పింపబడుతుంది.. అది రామలీల..
శ్రీ కృష్ణ పరమాత్మ మనుషులకు దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ప్రత్యక్షంగా చూపాడు.అందరికీ తన ఉనికిని చూపాడు. ధృతరాష్ట్రుడు... భీష్ముడు.. అర్జునునికి తన విశ్వరూప సందర్శనం గావించాడు.తాను ప్రకటమవుతూ అనేక లీలలను చూపించిన లీలామానస చోరుడు శ్రీ కృష్ణ భగవానుడు.. ఆయన కష్టాలు అన్నీ మనకు తెలియుటకే... ఆయనకు ఏవీ అంటవు...ఈ పోస్ట్ లో ఆయన లీలలు..అవి భక్తులకు ఎలా వరాలయ్యాయో తెలపబడింది..ఇది కృష్ణ లీల...
నా రామయ్య ఇంత కష్టం పడ్డాడు.. నా కన్నయ్య ఇన్ని కష్టాలను నెగ్గాడు..అన్నవి భక్తుల మనోభావనలు ..అని నా అభిప్రాయం..