శ్యామలీయం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
యస్య సర్వే సమారంభాః - కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం - తమాహుః పండితం బుధాః - గీత.4.19
మీరు పొరపాటుగా quote చేసారు.
పిచ్చ మీడియా అసత్య ప్రచారాలు ఏకపక్ష వార్తల వల్ల విశ్వసనీయత జనంలో పెరుగుతుందాండీ? ఎందుకు వచ్చిన గప్పాలూ?
ఇంద్రశబ్దము శ్రేష్ఠతా వాచకము. నాగమనగా పాము కావచ్చును లేదా యొక యేనుగు కావచ్చును. కాని సందర్భము ననుసరించి నాగ మనగా నిచట నేను గనియే. ఈనాగ శబ్దమునకు ఇంద్రశబ్దమునం జోడించి చెప్పుట యనగా నది యొక శ్రేష్ఠమైన గజరాజ మని చెప్పుట. ఈగజేంద్రుని వైభవము బలము మున్నగునవి కథలో నప్పటికే బాగుగా వర్ణించబడి యున్నవి. అట్టి యేనుగుల రాజునకు ప్రాణములు ఠావులు తప్పుచున్నవి.
వినాయకుడి బొమ్మ అద్భుతంగా వచ్చిందండీ.
వినాయకుడి బొమ్మ అంటే నాకు తప్పకుండా ఒక తమాషా సంఘటన గుర్తుకు వస్తుంది. మావదిన గారు ఒకవిడ మనవడు జన్మతః మంచి చిత్రకళతో పుట్టాడు. ఒకసారి అతను వేస్తున్న బొమ్మలున్న పుస్తకం చూపించాడు, అందులో వినాయకుడి బొమ్మ ఉంది. ఐతే ఆబొమ్మలో వినాయకుడు మనం నిత్యం చూసేలా బాగా బొద్దుగా కాకుండా సన్నగ ఉన్నడు. "ఇదేమిటయ్యా వినాయకుడు ఇలా సన్నగా ఉన్నాడూ" అని అడిగితే, "వినాయకుడు డైటింగ్ చేస్తున్నాడు" అని చెప్పాడు తక్షణమే తడుముకోకుండా! ఆమాటను మేమంతా భలే ఎంజాయ్ చేసాం. ఆ పిల్లవాడు ఇప్పుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు పెద్దై.
ఈ కీర్తనను ప్రస్తావిస్తూ ఒక అజ్ఞాత నన్నుతూర్పారబడుతూ ఒక వ్యాఖ్యను పంపారు. దాన్ని ప్రచురించనవసరం లేదు కాని కొందరికి ఉండే అపోహలను తొలగించటం కోసం కొన్ని మాటలు వ్రాస్తున్నాను.<br /><br />శివపురాణమూ విష్ణుపురాణమూ రెండూ వ్యాసప్రోక్తములే.<br />శివానందలహరీ శ్రీరామకర్ణామ్తమూ రెండూ శంకరాచార్యులవారి కృతులే.<br />శివపారమ్యంగా ఒకటి ఉంటే విష్ణుపారమ్యంగా మరొకటి ఉండి కొందరికి సందేహం కలిగించవచ్చు.<br />
ఈ రామతారక శతకం PDF copy మనకు ఆర్కీవ్ సైటు నుండి దిగుమతి చేసుకోవటానికి అందుబాటులో ఉంది.
మీరు https://ia601507.us.archive.org/23/items/in.ernet.dli.2015.331985/2015.331985.Raamataaraka-Shatakamu.pdf అన్న లింక్ ద్వారా సులభంగా దిగుమతి చేసుకొని చదువుకొని ఆనందించగలరు.
ఇలాంటి విపరీతపు పోకడను పాఠకుల దృష్టికి తేవటమే నా ఉద్దేశం.<br />
అదృష్ణం. మీరు కోరుకున్న కీర్తన వచ్చిందండీ.<br /><br /><a href="https://syamaliyam.blogspot.com/2024/01/blog-post_29.html" rel="nofollow"><br />యోగులు ధ్యానించు హరి యయోధ్యను నేడు<br />పౌగండప్రాయుడాయె బాలరాముడై<br /></a><br />అని ఈకీర్తన కొద్ది సేపటి క్రిందట వెలువడింది.
కావాలని ఏకీర్తననూ వ్రాయలేనండీ. రామేఛ్ఛ మేరకే వస్తాయి కీర్తనలు.
హరిబాబు గారు, గానసౌలభ్యాన్ని బట్టి చిన్నచిన్న మార్పులు సహజమండీ. ఐతే అర్ధం మారిపోయేలాగు కాని అసహజంగా ఉండే లాగు కాని, వినటానికి ఇబ్బందిగా ఉండే లాగు కాని సాహిత్యాన్ని మార్పుచేయకూడదు. సాహిత్యం అలాగే ఉండాలి. పాడటంలో కొంచెంగా బాణీని బట్టి హ్రస్వదీర్ఘాదులు వస్తూ ఉండవచ్చును.<br /><br />ఐతే కొందరు అత్యుత్సాహంగా సాహిత్యానికి మెఱుగులు దిద్దబోయి పాడుచేస్తూ ఉంటారు. వారికి దురుద్దేశం లేకపోయినా ఒక్కోసారి జరిగిన
అవునా అండీ. మీరు చెప్పిన "రామనామము రామనామము రమ్యమైనది రామనామము" అన్నది బహుళ ప్రచారం పొందినది. అది ఆర్కీవ్స్ సైట్ లోపల ఉంది. ఎక్కడుందో వెదకి పొష్టుచేస్తాను వీలైతే.
విషయానికి కట్టుబడి మాట్లాడండి అనామకులవారూ. వ్యాసంలో చెప్పినది కేసీఆర్ మంచి చేసినా ఓడించారని. ప్రజలు అలా మంచి జరిగింది అనుకుటే ఆయన్న గెలిపించే వారే కాని వారు అలా ఆనుకోలేదని అభిప్రాయం వెలిబుచ్చాను.
అవసరానికి మించిన మంచి చేయటమే కేసీఆర్ పొరపాటు అనటం వ్యాసకర్త పొరపాటూ అసహనమూ అని చెప్పక తప్పదు.
మధ్యలో మీరెవరో అనామకులు వచ్చి నాగురించి అనవసర వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం సబబు కాదు.
ప్రజలు కేవలం సరదాకోసం మార్పును కోరుకోరు కదండీ? తగిన కారణం ఉందనుకుంటేనే కదా మార్పును కోరుకున్నది? గొప్ప అభివృద్ధి సాధించినా దించేసారూ అనటం ప్రజల వివేకాన్ని అవహేళన చేయటమే అవుతుంది.
>>తొమ్మిదిన్నరేళ్ళలో కేసీఆర్ సారథ్యంలోని ‘ఎనేబ్లింగ్ గవర్నెన్స్’ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అపూర్వమైన సంపద, శ్రేయస్సు చేకూరినప్పటికీ, అన్ని ప్రామాణికాలలో అసాధారణమైన వృద్ధి నమోదు అయినప్పటికీ, ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇచ్చి విజయాన్ని చేకూర్చారు.
అలా అనటం భావ్యం కాదు.కెసీఆర్ ఎంతో గొప్పగా పాలించినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇచ్చారని అనటం సబబు కాదు. ఆయన పాలన గొప్పగా ఏమీ లేదని భావించబట్టే ఆయన్ను ఓడించారని ఒప్పుకోవలసినదే.
>>ప్రజలు కోరుకున్న దానికంటే, అవసరాలను మించి కేసీఆర్ వారికి ఇచ్చారేమో! ప్రభుత్వాలు పథకాల రూపకల్పనకు ముందు, అమలుకు ముందు, అవి ప్రజలకు ఏ మేరకు అవసరమో అనే విషయంలో శాస్త్రీయ విశ్లేషణ చేయాలేమో!
ఇది దారుణమైన ఆరోపణ! ప్రజలకు అతిమేలు చేయటం అనేదే కేసీఆర్ చేసిన పొరపాటు అనటం తప్పు. పైగా ఎంత మేరకు మాత్రమే మంచిపాలన అందించటం మంచిదీ అని శాస్త్రీయ విశ్లేషణలు చేసుకోవాలీ అతి వర్జయేత్ అనటం ప్రజలవివేకాన్ని అవహేళన చేయటమే అవుతుంది.
>>ప్రజాకర్షక నినాదాలు ఇచ్చినప్పటికీ, ఎమర్జెన్సీ అనంతరం 1977లో జరిగిన ఎన్నికలలో తాను పోటీ చేసిన స్థానంలో పరాజయం పాలవడమేగాక, కాంగ్రెస్ పార్టీని పరాజయం దిశగా నడిపించింది.
ప్రజాకర్షణ అన్నది తప్పు. ఆమె స్వలాభానికి విధించిన ఎమర్జెన్సీ పెద్ద ప్రజాద్రోహం. అందుకే ప్రజలు ఆవిడకు బుధ్ధిచెప్పారు. అంతే కాని మీరు ముడిపెట్ట జూస్తున్నట్లు ఇందిరమ్మ చేసిన మేళ్ళేవో వెక్కసమై పోయి కాదండి.
ఏది ఏమైనా మీయీవ్యాసం శ్రీమాన్ కేసీఆర్ గారికి ఎలాగైనా కొంచెం ఉపశమనం కలిగించటానికి వ్రాసినట్లుగా ఐతే ఉంది కాని మీరు హృదయపూర్వకంగా వ్రాసినట్లుగా అనిపించటం లేదు. నిర్మొగమాటంగా చెప్పాలీ అంటే ఈవ్యాసం బాగోలేదు.
మీ సుదీర్ఘమైన టపాను వీలువెంబడి క్షుణ్ణంగా చదువుతాను.
ముందు మీ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి యత్నిస్తాను.
భగవంతుండు మనని ఎప్పుడూ పట్టుకొనే ఉన్నాడు.
జీవసహజమైన మాయ కారణంగా అది మనం గ్రహించలేకుండా ఉన్నాం.
గ్రహించిన నాడు మనం కూడా అయన్ను అమాంత ప్రేమతో పట్టుకుంటాం.
బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి.
భగవంతుణ్ణి మనం సరిగా పట్టుకున్ననాడు ఆయనకూ మనకూ అబేధం అవుతుంది.